అంగన్వాడీలు తమ సమస్యలపై చేస్తున్న దర్ణా పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదయిన శైలిలో స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఏ.పీ. లో అంగన్వాడీలకు, హెల్పర్లకు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ జీతం ఇస్తానని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆ హామీలను మర్చిపోయారని అన్నారు. అంగన్వాడీలు ఇదే విషయంపై నిరసన చేస్తుంటే వారిని వేధించడం సరికాదన్నారు. ఇలా బెదిరించడం వై.సీ.పీ. పాలకుల నైజాన్ని తెలియచేస్తోందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో దాదాపు 52 వేల అంగన్వాడీ కేంద్రాల్లో లక్ష మందికి పైగా మహిళలు విధులను నిర్వహిస్తున్నారన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు చేస్తున్న నిరసనను జనసేన పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. ఎన్నికల ముందు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వై.సీ.పీ. ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమేండ్ చేసారు.