యానాం – కాకినాడ జిల్లా సరిహద్దులోని అంతర్రాష్ట్ర చెక్-పోస్టులను కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. రాబోవు సాధారణ ఎన్నికలను దృష్ట్యా నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు ఇతర అక్రమ రవాణాను అరికట్టాలనే ఉద్దేశంతో, యానం – కాకినాడ జిల్లా సరిహద్దులలో ఏర్పాటుచేసిన అంతర రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను తనిఖీ చేసి కాకినాడ జిల్లా ఎస్పీ సూచనలు చేసారు.
కాకినాడ జిల్లా ఎస్పీ యానం సరిహద్దులో ఏర్పాటుచేసిన మల్లవరం, సుంకరపాలెం, మరియు అరటికాయలంక చెక్పోస్టులను తనిఖీ చేశారు. ఈ చెక్పోస్టుల యందు పనిచేస్తున్న పోలీస్ అధికారులుకు తగిన సూచనలు చేసి, నగదు. మద్యం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకొని ఈ మార్గాల్లో వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు.