అంతర్వేదిలో ఘోర సంఘటణ చోటుచేసుకుంది. విహార యాత్ర కోసం అంతర్వేది వెళ్లిన కొత్త దంపతులు గల్లంతయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడుకు చెందిన రేలంగి లక్ష్మీనారాయణ ఏలూరు జిల్లా కలిదిండి మండలం గురవయ్యపాలెం వాసి నాగ గాయత్రి కొత్తగా వివాహం జరిగింది. భార్యభర్తలు కలిసి విహార యాత్రకు అంతర్వేది వెళ్లారు. బీచ్ లో వారు స్నానానికి దిగగా కెరటాల ఉద్ధృతికి సముద్రంలో మునిగి గల్లంతయ్యారు.