ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని, ప్రజాస్వామ్య పరిరక్షణ పండుగలో తమ వంతు భాగస్వామ్యం వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా కోనసీమ జిల్లా వాసులకు పిలుపు నిచ్చారు. శనివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లో పాత్రి కేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పోలింగ్ నిర్వహణ, సన్నద్ధత విధివి ధానాలపై వివరించారు. నేటి సాయంత్రం 6 గంటల నుండి ప్రచారం ముగిసిందని రాజకీయ పార్టీల వారు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పని సరిగా పాటించాలన్నారు. 149 మంది సెక్టార్ అధికారులను నియమించడం జరిగిందని వీరు పోలింగ్ సిబ్బంది సమస్యలపై వెంటనే స్పందించి తగు చర్యలు చేపడతారన్నారు.