దొంగ మద్యం రవాణ చేస్తున్నారనే సమాచారంతో కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు కాకినాడ డివిజనల్ టాస్క్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ కాకినాడ జగన్నాధపురంలో వాహనాలను తనిఖీలు చేసారు. ఆ తనిఖీలలో యానం నుండి కాకినాడకు వస్తున్న ఒక ఆటోలో 650 మిల్లీ లీటర్లు గల 120 బీర్ బాటిల్స్, 750 మిల్లి లీటర్లు గల 10 మద్యం బాటిల్స్, 375 మిల్లీ లీటర్లు గల 44 మద్యం బాటిల్స్ మొత్తం 174 మద్యం బీర్ బాటిల్స్ ను పట్టుకున్నారు. దానితో పాటు ఆటోను సీజ్ చేసి సదరు ఆటో డ్రైవర్ నందిపు నూకరాజును అదుపులోకి తీసుకొని రిమెండ్ కు పంపినట్లు కాకినాడ దక్షిణ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ వెళ్ళడించారు.