Crime

అక్రమ రవాణ పీ.డీ.ఎస్. బియ్యం స్వాధీనం…

WhatsApp Image 2024-04-03 at 7.44.08 PM

కాకినాడ జిల్లాలోని తుని మండలములోని చేపూరు గ్రామము నందు పి.డి.ఎస్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నదన్న సమాచారముతో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో సదరు చేపూరు గ్రామంలో తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆ గ్రామంలో గల F.P.షాప్ నెం.4 నందు బజాజ్ మెగా ఆటో వాహనంలో వివిధ రంగుల బస్తాలలో సుమారు 10 క్వింటాళ్ళ బియ్యంను లోడింగ్ చేస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకుంన్నారు. సదరు వ్యక్తులపై కేసు నమోడు కొరకు పోలీస్ స్టేషన్ కు సిఫారసు చేసారు.

ఈ సందర్బంగా రీజనల్ విజిలెన్స్ ఎస్.పి. కె.ఎస్.ఎస్.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ… రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో పి.డి.ఎస్‌ అక్రమ నిల్వలు, అక్రమ రవాణా పై నిరంతరం నిఘా కొనసాగుతుందని చెప్పరు. ఎవ్వరైనా పి.డి.ఎస్‌ చౌక బియ్యం కొనడం, అమ్మడం చేస్తే సదరు వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖిలలో విజిలెన్స్ అధికారులు జగన్నాధరెడ్డి, విజయ కుమార్, సి.ఎస్.డి.టి వీరాస్వామి మరియు జీవానందం, శివ పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.33.17 PM
Crime

ముమ్మడివరం మండలం అంబేద్కర్ జిల్లాలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం..

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం ముమ్మడివరం మండలము లోని శ్రీ తారకరామా ట్రేడర్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ప్రకారం,
WhatsApp Image 2023-10-13 at 9.48.30 PM
Crime

ఘర్షణకు పాల్పడ్డ SKBR కాలేజీ విద్యార్థుల పై చర్యలు….

అమలాపురం పట్టణంలోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కాలేజీ విద్యార్థుల మద్య ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణలో రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని అమలాపురం డి.యస్.పి.