అక్రిడిటేషన్ తో ప్రమేయం లేకుండా అర్హులైన వర్కింగ్ జర్నలిస్ట్లందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర పౌర సమాచార , బీ.సీ. సంక్షేమ శాఖామంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను కాకినాడ ప్రెస్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కోరింది. రామచంద్ర పురంలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రిని కలిసి శాలువాతో సన్మానించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పీతల అచ్యుతరామారావు, ప్రధాన కార్యదర్శి గునిపే శోభన్ బాబు, ట్రెజరర్ కోనేటి శ్రీనివాస్ రావు, ఎడ్వైజరీ కమిటీ సభ్యులు టీవీ 7 అధినేత వీది సాయినాథ్, సీనియర్ జర్నలిస్ట్ ఎస్టి మూర్తి, ఇమేజ్ టీవీ ఎడిటర్ డి. మోహన్ తదితరులు మంత్రిని కలిసినవారులో ఉన్నారు.
ఈ సందర్బంగా మంత్రి వేణు మాట్లాడుతూ… పాత్రికేయులకు మూడు సెంట్లు ఇండ్ల స్థలాలు కేటాయింపుతో పాటు ప్రభుత్వం ఇళ్లు నిర్మాణం చేయడం జరుగుతుందని, పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తన సంకల్పంలో భాగమైన బీ.సీ. జనగణన, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కల నెరవేరుతోందని మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు.