క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారంగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ సేవాపతకం అందుకుంటున్న కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్.పి. ఎం.జె.వి. భాస్కరరావు కి పౌరసంక్షేమ సంఘం అభినందనలు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అవార్డు అందుకుంటున్న అతి కొద్ది మంది అధికారుల్లో కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్.పి. వుండడం పట్ల పౌర సంఘం కన్వీనర్, ప్రముఖ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు హర్ష వ్యక్తం చేశారు. నగర పౌరుల తరపున పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ సీనియర్ పాత్రికేయులు తంగిశెట్టి మధుసూదన రావు బందిలి సత్యంబాబు ఎ.ఎస్.పి. మరింత కీర్తి పతాక పొందాలని ఆకాంక్షించారు.
అనంతరం ఎన్నికల కమీషన్ ఆదేశాలతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్.పి. సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన రాజకీయ పార్టీల ప్రజాసంఘాల సమావేశంలో నగర డి.ఎస్.పి. హనుమంత రావు ఆహ్వానం మేరకు రమణరాజు పాల్గొన్నారు. వివిధ సంఘాల సమావేశాలు సదస్సుల నిర్వహణపై ముందస్తు అనుమతు లు తీసుకోవాల్సిన అంశాన్ని ప్రస్తావించగా తగిన సమాచారం ఇస్తే ఎన్నికల కమీషన్ విధి నిర్వహణకు దోహదం అవుతారని ఎస్.పి. వివరించారు.