అత్యుత్తమ అధికారి ప్రవీణ్ ఆదిత్య జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన నెలన్నర రోజులు పూర్తి కాకుండానే పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ చేయడం అత్యంత దురదృష్టకరమని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. కాకినాడ నగర పాలక సంస్థలో కమీషనర్ గా పనిచేసిన అత్యుత్తమ అధికారి వావిరాల మహేష్ కుమార్ ను నెలల వ్యవధిలోనే బదిలీ చేసారన్నారు. అదే కార్పోరేషన్ లో వివిధ హోదాల్లో ఆరున్నర ఏళ్లుగా తిష్ట వేసిన అధికారులను కొనసాగిస్తున్నారని ఎన్నికల వేళలో పాతుకు పోయిన వారిని బదిలీ చేయకుండా అత్యుత్తమ అధికారులను అవినీతి అక్రమాలకు సహకరించని వారిని బదిలీ చేయడం దురదృష్టకరమన్నారు. ప్రవీణ్ ఆదిత్య వంటి ఐ.ఎ.ఎస్. అధికారులు కాకినాడ జిల్లాకు కలెక్టర్ గా తదుపరి ప్రభుత్వంలో రావాలని పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు ఆకాంక్షించారు. నిజాయితీ కలిగిన అధికారులకు ఎక్కడ పోస్టింగ్స్ ఇచ్చినా బాధ పడరని అటువంటి అధికారులను కాకినాడ జిల్లాకు లేకుండా చేయడం ప్రగతి కి పట్టిన గ్రహణంగా పేర్కొన్నారు.