విజయవాడ కోర్టుల దగ్గర ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 కి వ్యతిరేకంగా 42 రోజులుగా దీక్ష చేస్తున్న న్యాయవాదులను మాజీ మంత్రి నెట్టెం రఘురాం, సీ.పీ.ఐ. జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ గార్లతో కలసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా నూతన భూ చట్ట కాపీలను చించేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… మేధావులు మౌనంగా ఉండడం వలన దుర్మార్గుడు రాజ్యం ఏలుతున్నాడని అన్నారు.
రాజ్యాంగాన్ని అవపాసన పట్టిన న్యాయవాదులు, రాజ్యాంగాన్ని అమలుపరిచేలా చేసి రాష్ట్రాన్ని కాపాడుతున్న న్యాయవాదులను 42 రోజులుగా రాష్ట్ర సీ.ఎం. జగన్ కట్టడి చేస్తున్నాడన్నారు. 56 నెలలుగా దెబ్బతింటున్నామని ఆయన అన్నారు. ఊరు వాడ తిరిగి నల్లకోటు ధరించి ప్రజలలోకి వెళ్తే పెద్ద ప్రజా ఉద్యమం అవుతుందని హెచ్చరించారు.