బర్రెలక్క అలియాస్ శిరీషా ఆచూకీ తెలియజేయాలని, బర్రెలక్క పై ఒత్తిడి తెస్తే రెండు రాష్ట్రాల నిరుద్యోగుల ఆగ్రహాన్ని చవిచూస్తారని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ హెచ్చరించారు. బర్రెలక్క ఆచూకీ తెలిసేంతవరకు బాధ్యత ఎన్నికల అధికారులే తీసుకోవాలి. ఆమెకు ఇబ్బంది కలిగిస్తే రెండు రాష్ట్రాల్లో ఉన్న నిరుద్యోగులు మనస్థాపానికి గురవుతారని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, భవిష్యత్తులోనైనా నిరుద్యోగులను ఇబ్బంది పెట్టకుండా ప్రతి ప్రభుత్వం నిరుద్యోగులకు సకాలంలో ఉద్యోగ వయోపరిమితులు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.