భారత దేశ రాజధానిని పట్టి పీడిస్తున్న తీవ్రమైన వేడిగాలుల కారణంగా ఢిల్లీ విమానాశ్రయానికి రెండు అంతరాయాలు ఎదురయ్యాయి. మొదటి సందర్భంలో ప్రయాణికులు ఎక్కిన తర్వాత కూడా ఇండిగో విమానం టెర్మినల్కు తిరిగి రావాల్సి వచ్చింది. అధిక నేల ఉష్ణోగ్రతలు కారణంగా ఈ పరాస్థితి ఎదురయ్యింది సిబ్భంది తెలిపారు.
రెండవ సంఘటనలో ఢిల్లీ ట్రాన్స్కో లిమిటెడ్ గ్రిడ్ నుండి వోల్టేజ్ అసమతుల్యత కారణంగా ఏర్పడిన విద్యుత్తు అంతరాయం కారణంగా బోర్డింగ్, చెక్-ఇన్ సేవల గురించి ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో కొద్దిసేపు IGIA కార్యకలాపాలు అస్తవ్యస్తంగా మారాయి.
ఇండిగో విమానం బాగ్డోగ్రాకు మధ్యాహ్నం 2:10 గంటలకు బయలుదేరాల్సి ఉంది. రెండు గంటల తర్వాత విమానాన్ని టెర్మినల్కు తిరిగి పిలిచారు. ఎట్టకేలకు ఇది దాదాపు మూడు గంటలు ఆలస్యంగా సాయంత్రం 5:51 గంటలకు బయలుదేరింది. ఎండ వేడిమితో గంటల తరబడి కూర్చోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.