జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయభేరి సభను ఏర్పాటుచేసారు. ఈ సందర్బంగా ఆయన అనకాపల్లి అభివృద్ధి ప్రణాళికతో వరాల జల్లులు కురిపించారు. అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్ధులను గెలిపించాలంటూ గాజుగ్లాజు, కమలం గుర్తులను ప్రదర్శించారు. హెలీ ప్యాడ్ నుంచి బయలుదేరిన ఆయనకి సమస్యలు చెప్పుకొనేందుకు వివిధ వర్గాల ప్రజలు ప్ల కార్డులతో పోటీపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు. సీ.పీ.ఎస్. అంశం మీద, తుమ్మపాల చక్కెర కర్మాగారం సమస్యలపై గళం విప్పాలని పలువురు రైతులు, ఉద్యోగులు కోరారు. పవన్ కళ్యాణ్ ఈ రెండు అంశాల మీద వారాహి విజయ భేరీ సభలో స్పందించారు. సభలో జనసేన అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్ధి కొణతాల రామకృష్ణ, కూటమి పార్లమెంటు అభ్యర్ధి రమేష్, టీ.డీ.పీ. నాయకులు పీలా గోవిందు, జనసేన పార్టీ విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లిలో పవన్ విజయభేరీ సభ…
![maxresdefault (3)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/04/maxresdefault-3.jpg?resize=1280%2C700&ssl=1)