తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అనపర్తి మడలం రామవరంలో ధివంగత నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ వేడుకకు టీ.డీ.పీ. రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమల్లి రామ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇందులో భాగంగా తొలత ఆయన ఎన్.టీ.ఆర్. విగ్రహీనికి పూలదండ వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు రాష్ట్ర ప్రజల ఆరాద్య దైవం నందమూరి తారక రామారావని అన్నారు. తెలుగు వారి గుర్తింపు కోస అహర్నిషలు కృషి చేసిన వ్యక్తి ఎవరయినా ఉంటే అది కేవలం ఎన్.టీ.ఆర్. అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి నల్లమల్లి రామ కృష్ణారెడ్డి, టీ.డీ.పీ. కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
అనపర్తి లో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు…
![WhatsApp Image 2024-01-18 at 10.17.35 AM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-18-at-10.17.35-AM.jpeg?resize=1080%2C636&ssl=1)