తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. దానితో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తేలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అనపర్తి కి చెందిన గొలుగురి వెంకటరెడ్డి వ్యక్తిగత పని నిమిత్తం అనపర్తి లో రైల్వే పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందిని వారు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసామని, దర్యాప్తు కొనసాగిస్తున్నామని జి.ఆర్.పి. ఎస్సై లోవరాజు తెలిపారు.
అనపర్తి లో ఘోర ప్రమాదం… రైలు ఢీకొని వ్యక్తి మృతి…
![maxresdefault (1)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/06/maxresdefault-1.jpg?resize=1280%2C700&ssl=1)