కాట్రేనికొన గ్రామంలో తీర ప్రాంతాల అభివృది కార్యాక్రమాన్ని చేపట్టారు. యు.ఎన్.డి.పి. నిధులతో కాట్రేనికొన పరిశర ప్రాంతాలలో పనులు చేస్తున్నారు. అభివృద్ధి పనులను జీ.సీ.ఎఫ్. ప్రత్యేక బృందం పరిశీలించిందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అటవీ శాఖాధికారి ఎమ్.వి. ప్రసాద్ రావు తెలిపారు. కాట్రేనికొన మండల పరిధిలోని రాతి కాలువ సెక్షన్, కందికుప్ప సెక్షన్ పరిధిలో పనులను పరిశీలించారని ఆయన అన్నారు.
తదనంతరం వన సంరక్షణ సమితి సభ్యులతో మత్సశాఖ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళ సభ్యులతో పలు సంక్షేమ పథకాలు జరుగుతున్న విధానంపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్.ఆర్.ఓ. హరి కుమార్, డి.ఆర్.ఓ. కె. రవి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎమ్. సాయి బాబా, లోవ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.