Andhra Pradesh

అభ్యర్థులను ప్రకటించన వై.సీ.పీ. అధినేత….

RamaK-Jagan-stimulus_Y.S.-Jagan-Mohan-Reddy-1

ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 24 లోక్‌సభ నియోజకవర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. సిట్టింగ్ ఎంపీలలో మెజారిటీని వదులుకున్నట్లు తెలిపింది. కడప జిల్లా ఇడుపుల పాయలో తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డికి నివాళులర్పించిన అనంతరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థులను ప్రకటించారు. అనకాపల్లి లోక్‌సభ స్థానానికి మాత్రమే అధికార పార్టీ ప్రకటనను పెండింగ్‌లో ఉంచిందని అన్నారు.

2019లో 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకున్న వై.ఎస్‌.ఆర్‌.సీ.పీ. ఈసారి టీ.డీ.పీ., బీ.జే.పీ. మరియు జే.ఎస్‌.పీ. కూటమితో నేరుగా గట్టిపోటీని ఎదుర్కొంటోంది. ఏడుగురు సిట్టింగ్‌ ఎం.పీ. లను మినహాయిస్తే వైఎస్సార్‌సీపీ మిగిలిన వారిని వదులుకోవడం లేదా అసెంబ్లీ స్థానాలకు మార్చడం చేయనున్నట్లు తెలుస్తుంది. 200 స్థానాల్లో ఎమ్మెల్యే ప్లస్ ఎంపీ, 50 శాతం సీట్లు 84 ఎమ్మెల్యేలు, 16 ఎం.పీ. సీట్లును బీసీ/ఎస్సీ/ఎస్టీ/మైనారిటీ వర్గాలకు కేటాయించినట్లు పార్టీ తెలిపింది.

జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ… పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేయనున్నట్లు తెలిపారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన కులాలకు 50 శాతం టిక్కెట్లు కేటాయించి టిక్కెట్ల పంపిణీలో సామాజిక న్యాయం వైఎస్ఆర్సీపీకి కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇది చారిత్రాత్మక పరిణామమని ఆయన పేర్కొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-13 at 7.21.24 PM
Andhra Pradesh

ఆధిక బీపీ తో మహిళ బ్రెయిన్ డెడ్..

   రాజారపు నాగమణి 68yrs – (W/o: రాజారపు వెంకట శేషగిరి రావు ) చిట్టిబాబు భార్య అధిక బీపీ వలన బ్రెయిన్ లోని రక్తస్రావం జరిగింది..
News Andhra Pradesh Political Anakapalli Srikakulam Visakhapatanam

ముఖ్యమంత్రి YS జగన్‌ అక్టోబర్‌ 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం