జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి గడపగడపకు మన ప్రభుత్వం నిధులు 15 ఆర్థిక సంఘం, సాధారణ నిధులు తో అభివృద్ధి పనులు చేపట్టారని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ తెలిపారు. కోనసీమ జిల్లా అమలాపురంలో స్థానిక పురపాలక సంఘం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను విశ్వరూప్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పురపాలక పరిధిలో సాధారణ, 15 ఆర్థిక సంఘం గడప గడపకు మన ప్రభుత్వం నిధులైన రూ. 237.16 లక్షలతో పలు వార్డుల్లో ఎనిమిది అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందన్నారు. వచ్చే ఎన్నకల్లో మళ్లి జగన్ ప్రభుత్వాన్నే గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయిల్, పురపాలక సంఘ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి, వైస్ చైర్మన్ నాన్ రాజు, మున్సిపల్ కమిషనర్ ఎస్. మనోహర్, తదితరులు పాల్గొన్నారు.