అమలాపురం స్థానిక గడియార స్తంభం సెంటర్లో అయితా బత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో కార్మికుల చైతన్య బస్సు యాత్ర కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా టిఎన్టియుసి కార్మిక నాయకులు వలవల శివరావు, జిల్లా నాయకులు కుసుమే సూర్య మోహన్ రావు మరియు రాష్ట్ర నాయకులు రఘురామరాజు టెక్కలి నుండి కుప్పం వరకు టిఎన్టియుసి బస్సు యాత్ర కొనసాగించారు.
ఈ సందర్బంగా టిఎన్టియుసి కార్మిక నాయకులు వలవల శివరావు మాట్లాడుతూ… కార్మికులందరినీ ఐకమత్యంగా కలిపి కార్మిక నాయకులు యొక్క అవసరాలు తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ యాత్రను చేపట్టామన్నారు. వారి కోరికలను చంద్రబాబు నాయుడుకు తెలియపరచి కార్మికులకు అండదండలుగా ఉండడం కోసమే ఈ యాత్ర చేపడుతున్నామని తెలియపరిచారు. ఈ కార్యాక్రమానికి టిఎన్టియుసి కార్మిక నాయకులు వలవల శివరావు, జిల్లా నాయకులు కుసుమే సూర్య మోహన్ రావు , రాష్ట్ర నాయకులు రఘురామ రాజు, కార్మిక నాయకులు, టీ.డీ.పీ. నాయకులు, తదితరులు పాల్గొన్నారు.