అమలాపురంలో మళ్ళీ 2024ఎన్నికలు రిజల్ట్ మళ్ళీ రిపీట్ అవ్వబోతుందా అంటే అవుననే అమలాపురం నియోజకవర్గం ప్రజలు చెబుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం నియోజకవర్గంలో తనకంటూ సొంత ఓటు బ్యాంక్ ఉన్న పరమట శ్యామ్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో చివరి నిమిషములో టి.డి.పి. టికెట్ చేజారిపోవడంతో ఖచ్చితంగా 2024లో న్యాయం జరుగుతుందని శ్యామ్ కుమార్ వర్గీయులు ఆశించారు.
కానీ ఈ సరికూడా న్యాయం జరగకపోవడంతో శ్యామ్ కుమార్ వర్గీయుల తీవ్రనిరాశ చెంది కచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయలని శ్యామ్ కుమార్ పై ఒత్తిడి తేవడంతో నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కి వెళ్లి మద్దతు కూడగడుతున్నట్లు సమాచారం. 29 సంవత్సరం ప్రజలు మధ్యలో ఉన్న శ్యామ్ కుమార్ కు ప్రజా ఆదరణ రోజురోజుకు పెరుగుతుంది. కచ్చితంగా 30 వేలు మెజారిటీ తో గెలుస్తా అంటూ శ్యామ్ కుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.