తుఫాన్ కు గురయిన అమలాపురం పరివర ప్రాంతాలను మంత్రి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణ పరిధిలో పలుచోట్ల లాకులు వద్ద పేరుకు పోయిన గుర్రపు డెక్క, తూడు వెంటనే తొలగించాలని రాష్ట్ర రవాణాశాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ డ్రైనేజీ అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డ్, బస్టాండ్ వద్ద వంతెనలలో పేరుకుపోయిన తూడును, పూడికను అదేవిధంగా ఈదరపల్లి-నడిపూడి మార్గంలోని కుమ్మరి కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్కను అధికారులు పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పేరుకుపోయిన తూడును పూడికలను పూర్తిగా తొలగించి ముంపుకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పురపాలక సంఘ కమిషనర్ వి.ఐ.పి. నాయుడు స్థానిక తాసిల్దార్ పి శ్రీ పల్లవి, ఎంపీపీ కుడిపూడి భాగ్య లక్ష్మి ఎంపీడీవో జె వెంకటే శ్వరరావు తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.