Culture

అభివృద్ధికి నోచుకోని అమలేశ్వరస్వామి మడుగు…

WhatsApp Image 2024-02-18 at 1.49.22 PM

హిందూ సంప్రదాయాలకు, పుష్కర స్తానలకు పేరుగాంచిన అమలేశ్వర స్వామి మడుగు అధికారుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోకుండా అన్యాక్రాంతమవుతుందని కామాక్షి పీఠం కామేశ్వర మహర్షి ఆవేదన వ్యక్తంచేశారు. మూడు గ్రామల చిందాడగరువు, రోళ్లపాలెం, కామనగరువు పంచాయతీల పరిధిలో గల అమలేశ్వర స్వామి మడుగు 14 ఎకరాలు చెరువును 10 ఎకరాలు ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం ఆర్.డబ్ల్యూ. ఎస్ చేరువుగా ప్రజాప్రతినిధులు మార్చారంటూ కామేశ్వర మహర్షి అన్నారు.

రికార్డులు ప్రకారం 8 ఎకరాలు అంటున్నా అధికారులు ప్రస్తుతం కనిపించేది మాత్రం సుమారు 3 ఎకరాలు మాత్రమేనన్నారు. రాబోయే 2027 సంవత్సరం పుష్కరాలకు జిల్లా అధికారులు చొరవతో అమలేశ్వర స్వామి మడుగు(చిందాడ మడుగు) భక్తుల పుష్కర స్నానాలకు అభివృద్ధి చేస్తారని కామాక్షి పీఠం కామేశ్వర మహర్షి ఆకాంక్షించారు. మడుగును అనుకుని రైల్వే లైను సర్వే జరిగిందని, గతంలో జరిగిన సర్వే ప్రకారం రైల్వే లైన్ కొనసాగించి మడుగును కాపాడాలన్నారు. కోనసీమ ప్రజల చిరకాల కొరికైనా రైల్వే అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదని కామాక్షి పీఠం కామేశ్వర మహర్షి అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

News Culture Andhra Pradesh Political

భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ పూజలు

సామర్లకోట భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్ ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సతీ సమేతంగా ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు
News Culture Andhra Pradesh

అర్చకులకు దసరా కానుక

విజయదశమి సందర్భంగా అర్చకులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. 2019 ఎన్నికలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 1,177 మంది