కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అయోధ్యలో రామమందిరాన్ని సందర్శించి దేవుడికి నమస్కరించారు. కేరళ రాజ్ భవన్, గవర్నర్ రామమందిరాన్ని సందర్శించి దర్శనం చేసుకున్నారని పేర్కొంటూ X లో ఒక పోస్ట్ను చేసారు. అయోధ్యలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ విలేకరులతో మాట్లాడుతూ.. జనవరిలో రెండుసార్లు అయోధ్యను సందర్శించానని.. అప్పటి అనుభూతి నేటికీ అలాగే ఉందన్నారు. ఎన్నోసార్లు అయోధ్యకు వచ్చానని, అయోధ్యకు వచ్చి శ్రీరాముని పూజించడం మాకు గర్వకారణమని తెలిపారు.