![](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/Kanaka_Durga_Temple-1.webp?resize=640%2C365&ssl=1)
విజయదశమి సందర్భంగా అర్చకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభవార్త చెప్పారు. 2019 ఎన్నికలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 1,177 మంది అర్చకులకు కనీస వేతనం రూ.15,625లు అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఆ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.