Exclusive

అర్హులందరికీఓటు హక్కు కల్పించాలి… -సి.హెచ్. నాగ నరసింహారావు-

WhatsApp Image 2023-11-27 at 8.33.32 PM

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందిపై ఉందని కాకినాడ సిటీ నియోజకవర్గ ఈ.ఆర్.ఓ., కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు స్పష్టం చేశారు. స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పై బి.ఎల్.ఓ లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగ నరసింహారావు మాట్లాడుతూ… ఫారం 6,7,8 ద్వారా వచ్చిన ప్రతి ఒక్క దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. 2024 జనవరి ఒకటవ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే యువత కూడా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, వారిని కూడా ప్రోత్సహించాలని సూచించారు . 
ఆచూకీ లభించని ( నాన్ ట్రేస్డ్ ) ఓట్లకు సంబంధించి రిజిస్టర్ పోస్టు ద్వారా పంపిన నోటీసులు, వాటి ప్రగతిపై చర్చించారు. ఓకే డోర్ నెంబర్ పై ఎక్కువ ఓట్లు ఉంటే పరిష్కరించే విధానంపై సూచనలు ఇచ్చారు. ఓటర్ల నమోదు, మార్పులు-చేర్పులు, తొలగింపునకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రచురితమవుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియలో బి.ఎల్.ఓ. పాత్ర అత్యంత కీలకమన్నారు. సమావేశంలో ఈ.ఆర్.ఓ. కోన శ్రీనివాస్, సీతాపతి, మురళీకృష్ణ, నాగశాస్త్రులు, జాన్ బాబు, వరహాల బాబు తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.