దేశానికి వెన్నెముకైన రైతులకు చట్టపరమైన పథకాలు అందే విధంగా, మహిళలు, బాలికలపై జరుగుతున్న అకృత్యాలను ప్రాలద్రోలే విధంగా సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ కృషి చేస్తుందనీ ఆ సంస్థ ఫౌండర్ చైర్మన్ కంచర్ల సురేష్ అన్నారు. కాకినాడ కొండయ్య పాలెంలో నిర్వహించిన జాతీయస్థాయి కార్యవర్గ సమావేశానికీ ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… సమాచార హక్కు చట్టం -2005 పై అవగాహన సదస్సులు పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి లో సమాచార హక్కు చట్టం గురించి అవగాహన కల్పిస్తూ సమావేశాలు ఏర్పాటు చేసి అవినీతి లేని సమాజాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ సెక్రటరీ కవి రచయిత గంటా అప్పారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి సురేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మునిగేటి కాశి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భట్టు సంతోష్ తోలా నాయక్ , తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి ప్రభాకర్ నేషనల్ మీడియా కోఆర్డినేటర్ , హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కే బాలాజీ సింగ్, లీగల్ డిపార్ట్మెంట్ వెంకటేశ్వర్లు తో బాటు 10మంది నేషనల్ మరియు స్టేట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అనంతరం కాకినాడ జిల్లా ఇన్ ఛార్జ్ గా అభిషిక్త్ రోజ్ ను నియమిస్తున్నట్లు సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ జాతీయ అధ్యక్షులు బాలాజీ శంకర్ సింగ్ నియామక ఉత్తర్వులను అందజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా ప్రతినిధులు ఏపీ మీడియా ఇంచార్జ్ జి ఎన్ రావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు అరిగెల వెంకటరామారావు, కోనసీమజిల్లా ఇంచార్జ్ గొనె మడతల రవి కుమార్, సభ్యులు ఆకుల రమేష్ నాయుడు, అరిగెల తేజా వెంకటేష్ వున్నారు.