భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అశ్వారావుపేట మండలంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.పీ. జల్లిపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం స్థానిక రైతు వేదిక వద్ద సోదరి, సోదరులకు క్రిస్మస్ కిట్లను అందచేసింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా పాస్టర్స్ కు 2 లక్షల రూపాయల క్రిస్మస్ కానుకను అదేవింగా సోదరి సోదరులకు 1000 క్రిస్మస్ గిఫ్ట్ కీట్లను అందజేసామని తెలిపారు.
క్రిస్టియన్ సోదరి సోదరులు క్రమేపి పెరుగుతున్నారని దానిని దృష్టిలో పెట్టుకొని వచ్చే సంవత్సరం నుండి నియోజక వర్గంలో మరో 1000 కిట్లను అధనంగా పెంచడానికి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొగళ్లపు చెన్నకేశవరావు, చిన్నంశెట్టి సత్యనారాయణ, తుమ్మ రాంబాబు, క్రిస్టియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.