రాష్ట్రంలో ముఖ్యమంత్రి పరిపాలనను గాలికి వదిలేసారని అన్ని వర్గాల ప్రజలు రోడ్లు మీద ఉద్యమాలు నిర్వహిస్తున్నరాని జగన్ మాత్రం అసెంబ్లీ సీట్లు ఎవరకి ఇవ్వాలనే పనిలో ఉన్నారని సీ.పీ.ఐ. జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ విమర్శించారు. స్థానిక సీ.పీ.ఐ. కార్యాలయములో జిల్లా సమితి సమావేశము చింతలపూడి సునీల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అధితిగా హాజరుయిన వనజ మాట్లాడుతూ… రాష్ట్రంలో అనేక సమస్యలతో అంగన్వాడీలు, కార్మిక సంఘాలు మున్సిపల్ కార్మికులు, సమ్మె చేస్తుంటే సీ.ఎం. పరిపాలన గాలికి వదిలేసారని ఆమె ఘాటు గా విమర్శించారు. అందుకే పరిపాలన కోసం ఆ పార్టీ కి చెందిన మంత్రులు కు ముఖ్యమంత్రిని పీఠం ఎక్కించాలని సూచించారు. రాష్ట్రం అప్పులు ఊబిలో కూలిపోయిందని, సమస్యలన్నిటిని గాలికి వదిలేసి వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఎమ్మెల్యేల బదిలీలు పార్టీ కార్యక్రమాలకే జగన్ పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ సీట్లు పై దృష్టి పెట్టిన జగన్… -సీ.పీ.ఐ. సభ్యులు అక్కినేని వనజ-
![WhatsApp Image 2024-01-22 at 4.54.00 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-22-at-4.54.00-PM.jpeg?resize=1111%2C607&ssl=1)