అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐ.ఎస్.ఐ.ఎస్. ఉగ్రవాదులను గుజరాత్ ఏ.టీ.ఎస్. అరెస్ట్ చేసింది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఐ.ఎస్.ఐ.ఎస్. కు చెందిన ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న నలుగుర వ్యక్తులను అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న సమయంలో అరెస్ట్ చేసినట్లు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సోమవారం వెల్లడించింది. నిందితులు శ్రీలంక పౌరులని ఏ.టీ.ఎస్. తెలిపింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐ.పి.ఎల్. క్వాలిఫయర్, ఎలిమినేటర్ రౌండ్లను వరుసగా మే 21, 22 న మోటెరాలోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించడానిక ముందు అరెస్టులు జరిగినట్లు అధికారులు తెలిపారు.