మే 24న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని IMD అంచనా వేయడంతో ఆంధ్రప్రదేశ్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. మే 22 న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఇది మే 24 కి బంగాళాఖాతం యొక్క మధ్య భాగాలపై అల్పపీడనంగా మారా కేంద్రీకృతమయ్యే అవకాశముందని తెలిపింది.
రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానలు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, నైరుతి రుతుపవనాలు ఆదివారం మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు మరియు దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు మరియు దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించాయని IMD డైరెక్టర్ స్టెల్లా.