ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఆలోచనకు తాను గట్టి మద్దతు ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురువారం తెలిపారు. కర్నూలులో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. ఒకవైపు మైనారిటీ కోసం 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలని చూస్తున్న బీ.జే.పీ. తో చంద్రబాబు నాయుడు చేతులు కలుపుతూనే ఉన్నార. ని అన్నారు. ఊసరవెల్లి లాంటి చంద్రబాబు నాయుడుని చూశారా అని విమర్శించారు.
మరో నాలుగు రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగనుందని అన్నారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎం.పీ. లను ఎన్నుకోవడానికి కాదని, ఈ ఎన్నికలు కొనసాగుతున్న పథకాల భవిష్యత్తును, ప్రతి ఇంటి అభివృద్ధిని నిర్ణయిస్తాయన్నారు. చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే ఇంటింటికి ఈ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమం అంతా ఆపేస్తున్నారని అన్నారు.