దారి తప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతిని తిరిగి అభివృద్ధి వైపు పయనింపచేసేది ఒక్క జనసేన పార్టీనే అని ప్రజలు భావించి ఆదిశగా మార్పు కోసం ఎదురు చూస్తున్నారని మల్లాడి రామారావు చారిటబుల్ ట్రస్టు చైర్మన్ మల్లాడి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం విచ్చేస్తున్న సందర్భంగా ఆయనను కలిసి పార్టీలో చేరేందుకు ఆయన జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి భారీ ఎత్తున ర్యాలీగా భీమవరం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అవినీతి అక్రమాలతో అరాచకం ప్రజ్వరిల్లిపోతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుండి వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ నేపథ్యంలో తాను కూడా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒక్క జనసేనతోనే సాధ్యం…
![WhatsApp Image 2024-02-22 at 1.56.26 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-22-at-1.56.26-PM.jpeg?resize=720%2C700&ssl=1)