సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్స్లర్ ఆచార్య జి.ఎస్.ఎన్. రాజుకు పుట్టినరోజు వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీ.జే.పీ. కిసాన్ మోర్చా కోశాధికారి రాంపాల్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీరితోపాటు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి, సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి సింహాద్రినాధుని చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిఎస్ఎన్ రాజు మాట్లాడుతూ… విద్యార్థులంతా చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరారు.
ఆచార్య జిఎస్ఎన్ రాజు పుట్టినరోజు శుభాకాంక్షలు… -రాంపాల్ యాదవ్-
![acharya](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/06/acharya.jpg?resize=1026%2C680&ssl=1)