ప్రతిభ కలిగిన క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరిట వివిధ క్రీడా పోటీలను నిర్వహిస్తోందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు పేర్కొన్నారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఆడుదాం ఆంధ్ర పోటీలలో మండల స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలను తొలుత సచివాలయ పరిధిలో నిర్వహించి అక్కడ ప్రతిభ చూపిన వారిని నాలుగు మండలాలుగా విభజించి తుది పోటీలకు ఎంపిక చేశామన్నారు.
నాలుగు మండలాల నుంచి 40 టీంలను ఎంపిక చేసి నియోజకవర్గస్థాయి లో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ టీం లకు ఆయా క్రీడలకు సంబంధించిన కిట్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్యదర్శి ఎం. ఏసుబాబు, డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్, మేనేజర్ కర్రి సత్యనారాయణ, టీపిఆర్ఓ మానే కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.