ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ కు సంబంధించిన కిట్లను కాకినాడ కలెక్టరేట్ లో స్పందన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియతో కలిసి పరిశీలించి, క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా మాట్లాడుతూ… జిల్లాలో “ఆడుదాం ఆంధ్ర” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. 15 ఏళ్లు పైబడిన అన్ని వయసుల వారిని క్రీడలలో భాగస్వామ్యం చేయడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వం, ఆనందాన్ని సొంతం చేసుకోవడం, క్రీడా సంస్కృతిని విస్తృతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోందన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్యం గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో క్రీడా పోటీలను నిర్వహిస్తోందన్నారు. అందులో భాగంగా పురుషులు, మహిళల కోసం 5 విభాగాల్లో వేర్వేరుగా క్రీడా పోటీలు నిర్వహిస్తోందన్నాను.
ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ కు కిట్లను అందీచేసిన కలెక్టరేట్…
![WhatsApp Image 2023-11-27 at 6.52.31 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-27-at-6.52.31-PM.jpeg?resize=1257%2C700&ssl=1)