రామచంద్రపురంలో అంబేద్కర్ వారసుల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ నియోజకవర్గం కే. గంగవరం మండలం మెరకపొలం గ్రామంలో ప్రజాసేన అధ్యక్షులు, ఆదర్శ విద్యాసంస్థల అధినేత కాటే సుబ్రమణ్యం ఆద్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమలాపురం మాజీ ఎం.పీ. జీవి హర్ష కుమార్ వచ్చారు. ఈ సందర్బంగా మనమందరం అంబేద్కర్ ఆలోచన విధానంతో, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకొనివెల్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎం.పీ. జీవి హర్ష కుమార్ ముఖ్యఅతిథిగా, రామచంద్రపురం నియోజవర్గం జనసేన ఇన్ చార్జ్ చిక్కాల, తదితరులు పాల్గొన్నారు.