రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర యువతిలో చైతన్యాన్ని బయటకు తీసేందుకు, పోటీ తత్వాన్ని పెంచేందుకు ఆడుదం ఆంద్ర పోటీలను ప్రతీష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.ఇందులో భాంగంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో ఆడదాం ఆంధ్ర పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు స్థానిక ఎం.పీ.పీ. కుండ అన్నపూర్ణ, పేరవరం గ్రామ సర్పంచ్ గంటి విజయభారతి ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా అన్నపూర్ణ మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ ని సీ.ఎం. గా గెలిపించుకోవాలని అన్నారు. తదనంతరం పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు ఎం.పి.డి.ఓ. నాతి బుజ్జి, కుండ అన్నపూర్ణ, పేరవరం గ్రామ సర్పంచ్ గంటి విజయభారతి , తదితరులు పాల్గొన్నారు.
ఆత్రేయపురం మండలంలో ఆడుదం ఆంద్రా పోటీల కార్యాక్రమం…
![WhatsApp Image 2024-01-19 at 12.48.18 PM](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-19-at-12.48.18-PM.jpeg?resize=1080%2C700&ssl=1)