ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం నాడు ఆపరేషన్ ఝాదూ ద్వారా ఆప్ ను నాశనం చేసేందుకు బీ.జే.పీ. ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆప్ పెద్దగా ఎదగాలని, తమకు సవాలుగా మారాలని బీజేపీ కోరుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఆపరేషన్ ఝాదూ ద్వారా ఆప్ యొక్క పెద్ద నాయకులను అరెస్టు చేస్తారని అన్నారు. రాబోయే రోజుల్లో AAP యొక్క బ్యాంకు ఖాతాలు కూడా స్తంభింప చేసే ప్రయత్నాలు చేస్తారన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఆప్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తామని ఈడీ తరపు న్యాయవాది ఇప్పటికే కోర్టులో ప్రకటన చేశారు. ఎన్నికల తర్వాత మా అకౌంట్లను స్తంభింపజేస్తారని, మా ఆఫీసును ఖాళీ చేసి మమ్మల్ని వీధిన పడేస్తారని కేజ్రీవాల్ ఆరోపించారు.