Exclusive

ఆయుష్మాన్ నమోదు పై ఏఎన్ఎం లకు శిక్షణ… -కమిషనర్ నాగ నరసింహారావు ఆదేశం-

WhatsApp Image 2023-11-30 at 4.38.51 PM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ( పి.ఎమ్.జె.ఏ.వై. )లో భాగంగా అర్హులైన వారందరినీ ఆయుష్మాన్ హెల్త్ కార్డులో నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు ఆదేశించారు. స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఈ అంశంపై ఏ.ఎన్.ఎం. లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… వాలంటీర్ల సహకారంతో ప్రతి ఇంటికి వెళ్లి అర్హులను గుర్తించి యాప్ లో నమోదు చేయాలని సూచించారు. ఎంతో ప్రయోజనకరంగా ఉండే ఆయుష్మాన్ హెల్త్ కార్డులను అర్హులందరికీ అందేలా బాధ్యత తీసుకోవాలని కోరారు.
కార్డులు జారీ అయిన లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు ఈ.కే.వై.సీ. కూడా పూర్తి చేయాలని సూచించారు. అలాగే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకంపై కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలని, అర్హులందరితో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేయించాలని సూచించారు. సమావేశంలో ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ నవీన్, టీం లీడర్ హనుమకుమార్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.