రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 తాత్కాలికమేనని, దానిని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఇప్పటికీ ఉందని సుప్రీంకోర్టు విల్లడించింది. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీ.జే.ఐ. డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, సూర్యకాంత్లతో కూడిన 5 బెంచ్ రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును వెలువరించింది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది వచ్చే ఏడాది సెప్టెంబర్ 30లోగా అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.