![](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2023/10/Ruling-party-candidate-kicked-off.jpeg?resize=581%2C1024&ssl=1)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దాష్టీకాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. నెల్లూరు జిల్లా కావలి మండలం మద్దూరుపాడు జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్లపై దాడికి తెగబడ్డారు. కాలితో తన్నుతూ, పిడిగుద్దులు గుద్దారు. వయసులో పెద్దవాడని కూడా చూడకుండా విచక్షణారహితంగా నడిరోడ్డుపై దాడిచేశారు. కావలి డిపో నుంచి బస్సు బయటకు వచ్చిన తరువాత, ఆ బస్సు ముందు తమిళనాడు రాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగిన కారు నిలిపి ఉంది. అదే సమయంలో ఒక సైకిల్ అడ్డురావటంతో బస్సు డ్రైవర్ సింగ్ హారన్ కొట్టాడు. అమాంతం కారునుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి బస్సులో ఉన్న డ్రైవర్ను కాలర్ పట్టుకుని కిందికి లాగి కొట్టాడు. అతడి వెనుక మరికొందరు వచ్చి అతడితో పాటు దాడికి పాల్పడ్డారు. అడ్డువచ్చిన ప్రయాణీకుల సెల్ఫోన్లను రోడ్డుకేసి కొట్టారు. సమీపంలోని పోలీసులు వారిని నియంత్రించగా కావలి ఊరు దాటిన తరువాత మరోసారి రెండు కార్లు బస్సుకి అడ్డుపెట్టి ఆంజనేయ స్వామి గుడి సమీపంలో మరోసారి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని డ్రైవర్ కన్నీటి పర్వంతమయ్యాడు.