News Crime

ఆర్టీసీ డ్రైవర్‌, కండక్టర్‌లపై విచక్షణారహితంగా దాడి చేశారు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల దాష్టీకాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. నెల్లూరు జిల్లా కావలి మండలం మద్దూరుపాడు జంక్షన్‌ వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్‌, కండక్టర్‌లపై దాడికి తెగబడ్డారు. కాలితో తన్నుతూ, పిడిగుద్దులు గుద్దారు. వయసులో పెద్దవాడని కూడా చూడకుండా విచక్షణారహితంగా నడిరోడ్డుపై దాడిచేశారు. కావలి డిపో నుంచి బస్సు బయటకు వచ్చిన తరువాత, ఆ బస్సు ముందు తమిళనాడు రాష్ట్ర రిజిస్ట్రేషన్‌ కలిగిన కారు నిలిపి ఉంది. అదే సమయంలో ఒక సైకిల్‌ అడ్డురావటంతో బస్సు డ్రైవర్‌ సింగ్‌ హారన్‌ కొట్టాడు. అమాంతం కారునుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి బస్సులో ఉన్న డ్రైవర్‌ను కాలర్‌ పట్టుకుని కిందికి లాగి కొట్టాడు. అతడి వెనుక మరికొందరు వచ్చి అతడితో పాటు దాడికి పాల్పడ్డారు. అడ్డువచ్చిన ప్రయాణీకుల సెల్‌ఫోన్లను రోడ్డుకేసి కొట్టారు. సమీపంలోని పోలీసులు వారిని నియంత్రించగా కావలి ఊరు దాటిన తరువాత మరోసారి రెండు కార్లు బస్సుకి అడ్డుపెట్టి ఆంజనేయ స్వామి గుడి సమీపంలో మరోసారి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని డ్రైవర్‌ కన్నీటి పర్వంతమయ్యాడు.

Avatar

Spy News

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.33.17 PM
Crime

ముమ్మడివరం మండలం అంబేద్కర్ జిల్లాలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం..

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం ముమ్మడివరం మండలము లోని శ్రీ తారకరామా ట్రేడర్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ప్రకారం,
WhatsApp Image 2023-10-13 at 7.19.11 PM
News

కారుణ్య నియామకం లో ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్…

  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన ‌ముగ్గురు ఉద్యోగుల కుటుంబీకులకు కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లా కలెక్టర్ డా.