Exclusive

ఆర్.పి.ఐ (అంబేద్కర్ ) ఆధ్వర్యంలో సంవిధాన్ దివాస్…

IMG-20231126-WA0008

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్) ఆధ్వర్యంలో సంవిధాన్ దివాస్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ కార్యదర్శి పిట్టా వరప్రసాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని అంబేద్కర్ పార్లమెంటు సమర్పించారన్నారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు.రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్ 26న అంబేద్కర్ జ్ఞాపకార్థం రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే వారన్నారు. రాజ్యాంగ రూపకల్పనకు 2. సంవత్సరాల,11 నెలల18 రోజులు పట్టిందన్నారు. 1979 నుండి డాక్టర్ ఎం.ఎల్. సింగ్వి ఆధ్వర్యంలో నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం రోజున సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయ దినోత్సవం గా జరుపుకోవడం మొదలైంది అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు పిళ్ళా శ్రీనివాసరావు, మామిడి ప్రసాదరావు, శ్యాంసన్ రాజు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.