చరిత్రను చూసుకుంటే ప్రతీ ప్రాంతంలో అనేక అద్భుతాలు కనిపిస్తాయి. ఇటువంటి అద్భుత కథనాలు బహిర్గతం కాకుండానే అనగారిపోతుంటాయి. అందుకనే ఇప్పుడు చాలామంది అలాంటి చరిత్రలను అందరికీ తెలియజేయడానికి కృషి చేస్తున్నారు. అలాంటి కృషి ఫలితమే ఆలమూరోళ్ల కథలు పుస్తకే . ఈనాడు జర్నలిస్ట్ గొడవర్తి శ్రీనివాసు ఈ పుస్తకానికి రూపకల్పన చేశారు. హైదరాబాదులో ఈ పుస్తక ఆవిష్కరణ ప్రముఖుల చేతులమీదుగా జరిగింది.
ఆ పుస్తకాన్ని కొంతవరకు చదివితేనే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఆలమూరు గ్రామంలో ఇంతమంది కవులు ఉన్నారా అని ఆశ్చర్యమేసింది. గొడవర్తి శ్రీనివాసు “ఇ(పు)లసాయనం” పేరుతో రాసిన ఈ పుస్తకం ఎంతో అద్భుతంగా ఆలోచింపజేసేలా ఉంటుంది. ఓ పక్క పులస ప్రత్యేకతలు వివరిస్తూనే నదులను ప్రజలు ఎలా కలుషితం చేస్తున్నారు అనేది కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఇటువంటి పుస్తకాలు చదవటం ద్వారా అనేక విషయాలు తెలియడంతో పాటు పుస్తక పఠనంపై ఆసక్తి పెరుగుతుంది.