కష్ట నష్టాలు ఎదురైనా లక్ష్యం మాత్రం గురి తప్పకుండా విశ్వయత్నం చేయగలిగిన నాడే విద్యార్థులు విజయాన్ని సాధించగలరని ఎస్సై గా సెలక్ట్ అయి శిక్షణ పొందుతున్న కాలాడి రాజు తన విజయ గాథను వివరించారు. స్దానిక ఏటిమొగ రోడ్ బోట్ యూనియన్ సమీపంలో ఉన్న పార్క్ ప్రాంతంలో ఎటిమొగ యూత్ డవలపర్స్ ఆధ్వర్యంలో పదవ తరగతి, ఇంటర్మీడిట్ పరీక్షలు రాసే విద్యార్థినీ విద్యార్థులకు సిలబస్ మెటీరియల్స్ , ఎగ్జామ్స్ కిట్ , బుక్స్ పంపిణీ కార్య్రమంలో కాలాడి రాజు తో బాటు సుమారు 400 మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథితులు గా అగ్నికుల క్షత్రియ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అద్దంకి వెంకన్న బాబు, ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ చింతా నారాయణమూర్తి, కోనసీమ జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ కర్రి భీమేశ్వరరావు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఇ పాలుపు వీరబాబు , టీచర్ పెమ్మాడి సంతోష్ లు హాజరై విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించడం కోసం చేపట్టాల్సిన పలు అంశాల పై అవగాహన కల్పించారు.