ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆశావర్కర్లు కనీస వేతనం, వేతనం తో కూడిన మెటర్నిటీ సెలవులు, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5 లక్షలు, సిబ్బందిని పెంచి పని భారం తగ్గించాలన్న విధానపరమైన డిమాండ్లతో శాంతి యుతంగా నిరసన చేస్తున్న వారిపై పోలీసులు వ్యవహరిస్తున్న శైలి మంచిది కాదని పౌర సంక్షేమ సంఘం హెచ్చరించింది. నిరసనకు సిద్దమైన వారిని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు, అరెస్టులు చేస్తున్న ప్రభుత్వ వైఖరి సక్రమం కాదని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్ల పూడి రమణ రాజు అన్నారు. సకాలంలో చర్చలు జరిపి మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ఆశా వర్కర్ల ఆందోళన విరమింప జేసే ప్రక్రియ తక్షణం చేపట్టాలని కోరారు. ఆశా వర్కర్ల ఉద్యమానికి ప్రజల మద్దతు వున్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించడం మంచిదన్నారు.
ఆశావర్కర్ల అరెస్టుల పై స్పందించిన పౌర సంక్షేమ సంఘం…!!!
![R (8)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/02/R-8.jpg?resize=520%2C354&ssl=1)