బీ.ఆర్.ఎస్. అధినేత తెలంగాణ మాజీ సీ.ఎం. కే.సీ.ఆర్. డిసెంబర్ 8న తన స్వగృహంలో పడిపోయిన విషయం తెలిసిందే. ప్రమాదం కారణంగా కాలు ఫ్రాక్చర్ అయినందున అక్కడ ప్రైవేట్ సూపర్-స్పెషాలిటీ హాస్పిటల్లో ఎడమ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు.
విశ్రాంతి అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి నంది నగర్లోని తన నివాసానికి ఆయన వెళ్లనున్నట్లు ఆయనకు సన్నిహిత వర్గాలు తెలిపాయి. రెండు మూడు నెలల్లో కేసీఆర్ కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.