చేవెళ్ల, మహబూబ్ నగర్ స్థానాల ఇంఛార్జి నుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తప్పుకున్నారు. అలాగే సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాల ఇంఛార్జి నుండి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తప్పుకున్నారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇంఛార్జిలుగా ఉన్న చోట ఓడిపోతే పరువు పోతుందని తప్పుకున్నారని విమర్శలు వెళ్లువడుతున్నాయి. డిసెంబర్ నెలలోనే పార్లమెంట్ వారీగా నియోజక వర్గాల ఇంఛార్జిలను నియమించిన కాంగ్రెస్ పార్టీ.. నియమించి మూడు నెలలు కాకముందే ఇంఛార్జిలను మార్చింది.
డిసెంబర్ నెలలో రిలీజ్ చేసిన పార్లమెంట్ నియోజక వర్గ ఇంఛార్జిలలో రేవంత్ రెడ్డి చేవెళ్ల ,మహబూబ్ నగర్ స్థానాలకులకు ఇంఛార్జిగా ఉన్నారు. సికింద్రాబాద్, హైదారాబాద్ పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జిగా భట్టి విక్రమార్క ఉన్నారు. తాజాగా ప్రకటించిన లిస్టులో వారు ఆయా స్థానాల నుండి తప్పుకున్నట్లు వెళ్లడించారు. పార్టీలో మొదటి నుండి పని చేస్తున్న వారిని కాదని అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో జాయిన్ అయిన రేవూరి ప్రకాష్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావులకు వరంగల్, మల్కాజ్ గిరి ఇంఛార్జిగా టీ.పీ.సీ.సీ. నియమించారు.