రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత కల్పించి ప్రాథమిక వైద్య కేంద్రాలు, 104, ఫ్యామిలీ ఫిజిషియన్ వంటి కార్యక్రమాలు ద్వారా గ్రామాల స్థాయిలో ఇంటింటికి వైద్యం అందించడం అందరికీ తెలిసిన విషయమే. తాజాగా జగనన్న సురక్ష పథకం ద్వారా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అధిక సంఖ్యలో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నాం అని ప్రజాప్రతినిధులు, అధికారులు బాహాటంగా చెబుతున్న నేపథ్యంలో ఒక చిక్కు ప్రశ్న ప్రలను వెంటాడుతుంది. అదేంటి అంటే ఉమ్మడి ఉబయగొడావరి జిల్లాలకు ఆరోగ్య ప్రదాయిని బాసిల్లు తున్న కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి కి మాత్రం రోగుల సంఖ్య మాత్రం ఎక్కడా తగ్గడం లేదు అనేది సామాన్యులను వెంటాడుతున్న ప్రశ్నగా మారింది. గ్రామ స్థాయి నుండి విరివిగా వైద్య సేవలు అందిస్తున్నా పెద్దాసుపత్రి మాత్రం రోగుల భారం తగ్గడం లేదు.. అసలే క్రింది స్థాయి వైద్య ఉద్యోగుల కొరత, చాలీ చాలని మాంచాల పరిమితి, అరా కొర వసతి సౌకర్యాల తో సతమతం అవుతున్న జి జి హెచ్ కు వచ్చిన రోగులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. ఆసుపత్రిలో అడుగు పెట్టిన క్షణం నుండి అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ దగ్గరనుండి డాక్టర్ ను సంప్రదించిన తరువాత ఎక్స్ రే, ఆల్ట్రా సౌండ్ స్కానింగ్, ఈసీజీ, సిటీ స్కాన్, రక్త పరీక్షలు చేయించికుని మందులు తీసుకునే వరకు పెద్ద యుద్దమే చేయాల్సి వస్తుంది. పెరుగుతున్న రోగుల సంఖ్య దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అదనంగా సిబ్బంది నియామకం చేయక పోవడం దాని ప్రభావం రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించే ప్రక్రియకు అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా వార్డు బాయ్, తోటిలు చేయాల్సిన పనులు రోగిబందువులే చేయాల్సివస్తుంది. నిజానికి ప్రజల వద్దకే వైద్యం అందిస్తే ఇంతమంది రోగులు ఎక్కడి నుండి వస్తున్నారో అంతు చిక్కని సమస్యగా మారింది. ఇప్పటికై ప్రజలకు అందుబాటులో వైద్యం అందించి కాకినాడ జిజి హెచ్చ్ కి ఒత్తిడి తగ్గించాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు..