ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ఆదివారం రామ్లీలా మైదాన్లో జరిగిన ఇండియా బ్లాక్ ర్యాలీకి హాజరయ్యింది. ఎక్సైజ్ పాలసీ సంబంధిత కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న తన భర్త సందేశాన్ని చదివి వినిపించారు. కేజ్రీవాల్ నిజాయితీపరుడని మీరు నమ్ముతున్నారా?.. కేజ్రీవాల్ రాజీనామా చేయాలా?.. మీ కేజ్రీవాల్ సింహం.. కోట్లాది మంది ప్రజల గుండెల్లో బతికేస్తున్నారని ఆమె అన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో జరిగిన ర్యాలీకి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్ మరియు తేజస్వీ యాదవ్లతో సహా అగ్ర భారత నేతలు హాజరయ్యారు.
ఇండియా బ్లాక్ ర్యాలీలో సునీతా కేజ్రీవాల్…
![OIF (3)](https://i0.wp.com/spynews.online/wp-content/uploads/2024/03/OIF-3-1.jpg?resize=474%2C355&ssl=1)