అయోధ్య రామ పురం మునిసిపల్ హైస్కూల్ లో ఇందన వనరుల వినియోగం పై అవగాహన సదస్సు నిర్వహించారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా స్ధానిక బచ్చు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యుత్ ఉపకరణాల వినియోగం పొదుపు పై స దస్సు నిర్వహించారు. ఈ సంధర్బంగా విద్యుత్ శాఖ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ A.V.N.D.S. ప్రభాకర రావు మాట్లాడుతూ…విద్యార్ధి దశ నుంచే ఇందన వనరుల వినియోగం పై అవగాహన కలిగి పొదుపుగా వాడుకోవాలని పేర్కొన్నారు.
తదనంతరం ఆ హైస్కూల్ ప్రధాన ఉపాద్యాయులు తోటకూర సాయి రామకృష్ణ ఆధ్వర్యంలో వ్యాసరచన ,పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 120మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరికి 20వ తేదీ ముగింపు కార్యక్రమంలో సీనియర్ జూనియర్ విభాగాల్లో బహుమతులు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.